అమరావతి, ఫిబ్రవరి 27: ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొత్త ఇంటిని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నూతన గృహానికి ఈ నెల 14న ప్రవేశ మూహుర్తాన్ని ఖరారు చేయగా, జగన్ చెల్లి షర్మిల అనారోగ్యం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, బావ అనిల్కుమార్, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో సర్వమత ప్రార్థనల అనంతరం ఆయన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. సమీపంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. దీంతో గృహప్రవేశం తరువాత జగన్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాగా, త్వరలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి మారే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డి, ఆర్కే రోజా, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు