హైదరాబాద్, ఫిబ్రవరి 26: వెంకీమామ సినిమాలో నాగ చైతన్య సరసన నటించమని అడిగిన రకుల్ ని పాత్ర నిడివి తక్కువ ఉందని బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఊహించని విధంగా చైతూని కాదని వెండితెరపై నాగార్జునతో కలిసి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మధుడు 2 సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా నాగార్జున భార్య పాత్రలో రకుల్ ని తీసుకున్నట్లు సమాచారం. అరవై ఏళ్ల హీరో పక్కన నటించడమే సాహసం అనుకుంటే.. ఆ హీరో భార్య క్యారెక్టర్ ఓకే చెప్పింది రకుల్. ఇంత రిస్క్ అవసరమా..? అని అడుగుతోన్న సన్నిహితులకు మాత్రం కథ చాలా బాగుందని, దర్శకుడు రాహుల్ తన పాత్రను అధ్బుతంగా డిజైన్ చేశాడని చెబుతోందట. నాగార్జున సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరపనున్నారని తెలుస్తోంది.