హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఎన్నారై, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు ఊహించని మలుపులు తిరుగుతూ ఉంది. ప్రముఖ వ్యక్తులందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ మధ్యే నటుడు సూర్యప్రసాద్ ని కూడా విచారించారు. ఇదిలా ఉండగా జయరామ్ భార్య పద్మశ్రీ సోమవారం నాడు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది.
గత నెల 31వ తేదీన జయరామ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జయరామ్ హత్యకు గురైన విషయం తెలిసిన తర్వాత శిఖా చౌదరి జయరామ్ ఇంటికి వెళ్లింది. జయరామ్ బెడ్రూమ్ నుండి కొన్ని కీలక పత్రాలను శిఖా చౌదరి ఎత్తుకెళ్లారని పద్మశ్రీ గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇవాళ మరోసారి కూడ పద్మశ్రీ ఫిర్యాదు చేసింది.
హత్య జరిగిన తర్వాత శిఖా చౌదరి తమ ఇంటికి వెళ్లి ఇంటి పత్రాలను తీసుకెళ్లారని పద్మశ్రీ ఆరోపించారు. మరో వైపు ఇదే విషయమై పోలీసులు ఆధారాలు కావాలని కోరారు. శిఖా చౌదరికి సంబంధించిన ఆధారాలను పద్మశ్రీ తండ్రి గుత్తా పిచ్చయ్య చౌదరి పోలీసులకు అందించారు. ఈ విషయమై శిఖా చౌదరిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేసే ఛాన్స్ అవకాశం ఉందని సమాచారం.