కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

SMTV Desk 2019-02-25 16:08:31  Raghuveera Reddy, Congress Party, AP PCC, Low Caste, TDP, YCP

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ లో కుల చిచ్చులు ఎక్కువయ్యాయని, అవి తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులు, మైనార్టీల హక్కులు పూర్తిగా అణచి వేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని, బలహీన వర్గాలు కూడా కాంగ్రెఅమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ లో కుల చిచ్చులు ఎక్కువయ్యాయని, అవి తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీల్లో సామాజిక స్పృహలేదని, ఈ రెండు పార్టీల్లో బలహీన వర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని తెలిపారు. బీజేపీ బలహీన వర్గాలపై కక్షకట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు.