ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటి చెయ్యదు: చంద్రబాబు

SMTV Desk 2019-02-25 13:42:29  Chandrababu Naidu, Teleconference, MLC, Not Contesting, TDP

అమరావతి, ఫిబ్రవరి 25: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న పట్టభద్రులు, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయ్యడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టామని చెప్పారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో అన్న అంశంపై మాత్రం స్పష్టం చెయ్యలేదు సీఎం.