మోదీని ఒక విలన్ లా చూపిస్తున్నారు

SMTV Desk 2019-02-25 13:13:14  Smriti Irani, Narendra Modi, Rahul Gandhi, BJP, Congress

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించారు. "రాహుల్ తన సొంత నియోజక వర్గం అమేథీనే పట్టించుకోరు. తన నియోజక వర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టరు కానీ, దేశమంతా తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మోదీని ప్రజలకి ఒక విలన్ లా చూపిస్తున్నారు. ఎవరి పాలన ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ని రోజులు దేశాన్ని దోచుకుంది చాలదని మళ్ళి ఇప్పుడు అధికారం కోసం ఎగబడుతున్నారు" అని మండిపడ్డారు. "ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన రాజవంశాలు అమేథీ అభివృద్ధి గురించి, దేశంలోని రైతుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. ఒక పేద వ్యక్తి కుమారుడు దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేని మీరు ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరి కాదు" అంటూ హెచ్చరించారు.