బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు

SMTV Desk 2019-02-12 19:48:03  Revanth reddy, Vem narender reddy, Congress party working president, TDP Senior leader, ED Notices

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఓటుకు నోటు కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ని ఈ రోజు ఈడీ విచారించింది. ఈ కేసులో నరేందర్ రెడ్డితో సహా తన కుమారులను కూడా ఈడీ విచారించింది. నరేందర్ రెడ్డిని ఆయన కుమారులతో ఈడీ ఈ రోజు వివిడిగా విచారణ చేపట్టింది.

అంతేకాక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. రేవంత్ ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ ఆరా తీసింది. వివిధ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఏసీబీ ఇచ్చిన ఆధారాలతో ఈడీ విచారణ చేపట్టింది. కాగా ఈ నెల 19న రేవంత్ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి ఈడీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ఈ కేసుతో తన కుమారులకు ఎటువంటి సంబంధం లేకున్నా వారిని విచారించిడం భాదాకరం అని అన్నారు. అంతేకాక వారు అడిగిన అన్ని డ్యాకుమెంట్లను అందిచాను అని చెప్పారు.