హైదరాబాద్, ఫిబ్రవరి 12: హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలో 12 సంవత్సరాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. ఇప్పటివరకు తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంచింది. అయితే ఇప్పుడు కాజల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ లో ఉండి సంపాదించింది కాబట్టి, ఇప్పుడు ఇండస్ట్రీ లోనే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే ఇప్పుడు నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. కాజల్ కి బిజినెస్ పై కూడా పట్టు ఉండడంతో డబ్బులు ఎలా సంపాదించాలో ఆమెకి మంచి అవగాహన ఉంది.
ఇప్పటికే ఆమెకి జ్యూవెలరీ బిజినెస్ తో పాటు షూస్ కంపెనీ కూడా ఉంది. ఇప్పుడు ఆ భాధ్యతలు కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు అప్పగించింది. నిర్మాణ రంగంలో అడుగు పెట్టడానికి కాజల్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పుడు KA వెంచర్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ను మొదలుపెట్టనుంది. అ సినిమా దర్శకుడు ప్ర్రశాంత్ వర్మతో తన ఫస్ట్ ప్రొడక్షన్ సినిమా ప్లాన్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయిన కాజల్ నిర్మాతగా ఎలా రాణిస్తుందో చూడాలి మరి.