హైదరాబాద్, ఫిబ్రవరి 11: ట్విట్టర్ వేదికగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణా సీఎం కేసిఆర్ చంద్రబాబుని ఆయన సమర్ధించారు. కేసీఆర్ తిట్టే తిట్లకు చంద్రబాబునాయుడు అర్హుడేనని, ఆయనలా తిట్టడంలో తప్పేమీ లేదని లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. నారా లోకేష్ ఒక చిన్న పిల్లాడని, ఏదో పిచ్చి సలహా ఇచ్చి మోడీని అవమానించాలని చెప్తే, చంద్రబాబుకు ఉన్న 40 సంవత్సరాల అనుభవం ఏమైయిందని ప్రశ్నించారు. ఒక బీసీ ప్రధానికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? నిన్ను "థు మీ బ్రతుకు చెడ" అని తెలంగాణ సీఎం తిట్టడంలో తప్పే లేదు.. ఆ తిట్టుకి నువ్వు అర్హుడివి" అని ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
మరో ట్వీట్ లో "స్టిక్కర్ బాబు, మోదీ గారిని చాయ్ కప్పుల పేరుతో అవమానించడం నీ నిక్కర్ కొడుకు నారా లోకేశ్ ఐడియా నా? నీ లాగా 2 ఎకరాల నుండి మొదలై 2000 కోట్లు దోచేస్తే తప్పుకానీ, కష్టపడి పని చేసి మోదీ గారు ప్రధాని ఐతే తప్పేముంది? చంద్రబాబూ... నువ్వు తెలుగు వారి పరువు తీస్తున్నావు" అని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.
"స్టిక్కర్"బాబు,
— Kanna Lakshmi Narayana (@KLNTDP) February 11, 2019
మోదీ గారిని చాయ్ కప్పుల పేరుతో అవమానించడం నీ
"నిక్కర్"కొడుకు @naralokesh ఐడియా నా!?
నీ లాగా 2 ఎకరాల నుండి మొదలై 2000 కోట్లు దోచేస్తే తప్పుకానీ కష్టపడి పని చేసి మోదీ గారు ప్రధాని ఐతే తప్పేముంది!?
నువ్వు @ncbn తెలుగు వారి పరువు తీస్తున్నావు.#ShameOnYoUTurnCm pic.twitter.com/wZERB2bwel