ఒకేరోజు 4 లక్షల ఇళ్లను ప్రారంభించనున్న చంద్రబాబు

SMTV Desk 2019-02-09 12:55:19  Andra Pradesh, Chandrababu Naidu, 4lakh Houses, Nellore, East Godavari

అమరావతి, ఫిబ్రవరి 09: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృధ్ధికి సంబంధించి సరికొత్త ప్రాజెక్ట్ లకు స్వీకారం చూడుతుంది. ఈరోజు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు లేని పేదలకు పక్క ఇళ్లు అందించడంలో భాగంగా ఈరోజు ఒకేసారి 4 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇళ్ల పండుగ అనే పేరుతో నెల్లూరు జిల్లాలో ఈరోజు ప్రారంభించనున్నారు.

చంద్రబాబుతో పాటు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఇళ్లను ప్రజలకు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో లక్ష గృహాలను నిర్మించగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో మూడు లక్షల ఇళ్లను ప్రభుత్వం కట్టించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 39,169 గృహాలను, పట్టణ ప్రాంతాల్లో 13,844 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పండగలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర కాలనీలో 4,800 ఇళ్లను చంద్రబాబు ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ ఇళ్లను అపార్ట్ మెంట్ల తరహాలో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించారు.