చెన్నై, ఫిబ్రవరి 09: సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహ వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. నిన్న చెన్నైలో సౌందర్య ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ కి కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ రిసెప్షన్ ను ఏర్పాటు చేసారు. ఈ రిసెప్షన్కు వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్గా సీడ్ బాల్ను అందించారు. ఫార్మా బిజినెస్మేన్ విషగన్ వనగమూడితో సౌందర్య రజనీకాంత్ వివాహం ఆదివారం జరగనుంది. ఈ వివాహానికి రజినీకాంత్ సినీ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు.