ట్రిక్స్ ప్లే చేస్తున్న చంద్రబాబు : కన్నా

SMTV Desk 2019-02-08 20:24:10  Chandrababu, kanna lakshmi narayana, tdp, bjp, agri gold

అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై యూటర్న్ సీఎం చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు.

అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను టీడీపీ నాయకులు పూర్తిగా లాగేసుకున్నారన్నారు. బాధితుల పక్షాన పోరాడుతూ, వారికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ ధర్నాలతో నిలదీస్తే, కేవలం రూ.250 కోట్లు ఇచ్చి యూ-టర్న్ బాబు మరోసారి ప్రజలని మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు.