చెన్నై, ఫిబ్రవరి 07: చాలా గ్యాప్ తరువాత 96 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని మరోసారి తన ప్రతిభను చాటుకుంది చెన్నై బ్యూటి త్రిష. ఈ సినిమా తరువాత తమిళ్ లో త్రిష డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ సందర్భంగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శరవణన్ రూపొందించనున్నాడు.
గతంలో శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో `జర్నీ` (2011) చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించాడు శరవణన్. వేసవిలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. పదహారేళ్ళుగా కథానాయికగా రాణిస్తున్న త్రిష ఈ చిత్రంతో నటిగా మరో మెట్టు ఎదుగుతుందేమో చూడాలి.