అమరావతి, ఫిబ్రవరి 06: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజక వర్గం కమిటీల నియామకం చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ తన తొలి కమిటీని ప్రకటించింది. నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా యిర్రింకి సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కనకరాజు సూరి, యర్రా నవీన్, వైస్ చైర్మన్గా పోలిశెట్టి వాసు, కోశాధికారిగా పిళ్ళా నారాయణమూర్తిని నియమించారు.
చేగొండి సూర్యప్రకాశ రావు, పాదం మూర్తి నాయుడు, అనుకుల రమేష్ లను అధికార ప్రతినిధులుగా నియమించారు. వీటితో పాటు ఇంటలెక్చువల్ కౌన్సిల్, లీగల్ విభాగం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంతో పార్టీలో చేరిన విష్ణు రాజును జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా నియమించారు. ఈ విషయాన్నీ జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
జనసేన నరసాపురం పార్లమెంటరీ కమిటీ pic.twitter.com/a5868F0vmU
— JanaSena Party (@JanaSenaParty) February 5, 2019
Sri KV Vishnu Raju appointed as JanaSena Party Advisory Chairman
— JanaSena Party (@JanaSenaParty) February 5, 2019
Full album : https://t.co/haGW0tquwv
Video : https://t.co/xQhEgVCrqE pic.twitter.com/uYzLxoHHE6