హైదరాబాద్, ఫిబ్రవరి 05: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ . ఈ సినిమాను రెండు భాగులుగా చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులోని ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ని పోయిన సంక్రాంతికి విడుదల చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్దమవుతుంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం అయిన "మహానాయకుడు" సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు బాలక్రిష్ణ.
ఈ సినిమాని ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ భావించారు. కానీ మూవీ షూటింగ్ ఇంకా వారం రోజులు బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ఇప్పుడు ఈ సినిమాని శివరాత్రి సంధర్బంగా ఫిబ్రవరి 28 న రిలీజ్ చేయాలి అని నిర్మాతలు అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేదు, మరి ఇలాంటి సమయం లో సినిమాని జాగ్రత్తగా చూసి రిలీజ్ చేయాలి. టీం మాత్రం ఫిబ్రవరి 28 మంచి తేదీనే అని భావిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.