సాయి ధరమ్ తేజ్ కు షిఫ్ట్ అయిన పవన్ సినిమా...!

SMTV Desk 2019-02-05 17:35:49  Sai dharam tej, Pawan kalyan, Khushi, AM Ratnam, Janasena party chief

హైదరాబాద్, ఫిబ్రవరి 05: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఖుషి వంటి సూపర్ హిట్ సినిమాను ఇచ్చిన నిర్మాత ఏఎమ్.రత్నం. ఈయన పవన్ తో మరో సినిమా తీసేందుకు అప్పట్లో నిశ్చయించుకున్నాడు. అంతేకాక పవన్ కు అడ్వాన్సు కూడా ఇచ్చారట. కాని పవన్ మాత్రం అజ్ఞాతవాసి సినిమా అనంతరం పూర్తి స్థాయిలో సినిమాలను వదిలి రాజకీయం బాట పట్టారు. అయితే రీసెంట్ గా పవన్ నిర్మాతకు ఒక మాట ఇచ్చాడట. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయండి అంటూ తనకు ఇప్పుడు సినిమా చేసే ఆలోచన లేదని పవన్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశాడట.

సాయి ధరమ్ తేజ్ తో కూడా మాట్లాడతానని పవన్ చెప్పేశాడు. అయితే పవన్ రెమ్యునరేషన్ తిరిగిచ్చిన విషయంలో ఇంతవరకు ఓ క్లారిటీ లేదు. ఏఎమ్.రత్నం కూడా పవన్ నిర్ణయానికి సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఓ మంచి కథను కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఇప్పుడు పెద్దగా సక్సెస్ రేట్ లేదు. మరి అతను ఎంతవరకు ఏఎమ్.రత్నంకు హిట్టిస్తాడో చూడాలి.