నెల్లూర్, ఫిబ్రవరి 4: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ(89) నెల్లూరులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు మరణించారు. అయితే ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం లండన్ లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియడంతో ఆయన అక్కడ నుండి బయలుదేరారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.