గుడ్గావ్, ఆగస్టు 1 : ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి మహిళల శిరోజాలు కత్తిరిస్తున్న ఘటన బీహర్ జిల్లా గుడ్ గావ్ లో చోటుచేసుకుంది. సంత్ర అనే మహిళ తన భర్తతో కలిసి గుడ్ గావ్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. సోమవారం తెల్లవారు జామున సంత్ర గృహం ముందు ఏడుపు శబ్ధాలు వినిపించడంతో, భయపడి ఆమె తలుపు తీయలేదు. అనంతరం ఓ నల్ల పిల్లి మహిళగా మారి జుట్టు కత్తిరించి మాయమైపోయిందని, సంత్ర కేకలు పెట్టడంతో ఏం జరిగిందోనని వచ్చి చూసేసరికి సంత్రకు జట్టు లేకపోవడం చూసి ఖంగుతిన్నానని ఆమె భర్త ప్రకాశ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఈ విషయమై సంత్ర దంపతులు ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదని పోలీసులు అన్నారు. ‘ఓ పిల్లి మహిళగా మారిపోయిందని సంత్ర చెప్పడంపై, పోలీసులు నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరగడం అసంభవమని. కావాలనే ఆమె జుట్టును ఎవరో కత్తిరించి ఉంటారన్న సందేహం వ్యక్తం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారెవరో తెలుసుకునేందుకు విచారిస్తామని పోలీసులు తెలిపారు.