హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఇండియాలో మైఖేల్ జాక్సన్ కు నివాళిగా వో మ్యూజిక్ కన్సర్డ్ నిర్వహించడానికి ఓ టీం సన్నాహాలు చేస్తుంది. దీని కోసం ముంబయి, బెంగాళూర్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐయామ్ కింగ్ ద మైఖేల్ జాక్సన్ ఎక్స్పీరియన్స్ అన్న లైవ్ కన్సర్డ్ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
దేశదేశాలు తిరుగుతున్న ఆ టీమ్ ఇప్పుడు ఇండియాలో ఎంటర్కానున్నది. మార్చి నెలలో ఐయామ్ కింగ్ షోను నిర్వహించనున్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మొత్తం ఏడు షోలను ఏర్పాటు చేయనున్నారు. బుక్మైషో ద్వారా టికెట్లను అమ్ముతున్నారు. జాక్సన్ పాపులర్ హిట్స్నే మ్యూజిక్ షోలో ప్రదర్శించనున్నారు.