న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులూ వరుసగా విమర్శించాసాగారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ బడ్జెట్ ప్రభావం చూపుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా బడ్జెట్ ఉందని, ఇది నిజంగా ఎన్నికల బడ్జెట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పారు.
పియూష్ గోయల్ రైతులు, గ్రామీణులు, మధ్యతరగతిని ఆకట్టుకునేలా ప్రవేశపెట్టారు. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని గోయల్ తెలిపారు. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని, దేశ అభివృద్ధికి బాటలు పరిచే బడ్జెట్ అని తెలిపారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ ను పూర్తి చేస్తామని తెలిపారు.