న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆయన స్ధానంలో తాత్కాలికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు పీయూష్ గోయల్ స్వీకరించారు. నేడు(ఫిబ్రవరి 1న) బడ్జెట్ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన గోయల్ రైతులు, పేదల అనుకూల బడ్జెట్ను ప్రవేశపెట్టారని జైట్లీ ప్రశంసలు గుప్పించారు.
బడ్జెట్ను వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్యపరంగా కచ్చితత్వంతో కూడుకుని పేదలు, రైతుల సానుకూలంగా మలచడంలో అద్భుతంగా కృషిచేశారని పీయూష్ గోయల్ను అరుణ్ జైట్లీ అభినందించారు. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆర్ధిక స్థితిని పెంచేందుకు చర్యలు తిస్కున్నరన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేరుస్తూ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా బడ్జెట్కు రూపకల్పన చేశారని జైట్లీ ట్వీట్ చేశారు.