హైదరాబాద్, ఫిబ్రవరి 1: మంచు మనోజ్ తన అధికార ట్విట్టర్ ఖాతాలో కొందరిపై వో ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ కాస్త వైరల్ అయ్యి మనోజ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజగా కియా మోటార్స్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ వో ట్వీట్ చేశాడు మనోజ్. కానీ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఎందుకు ట్వీట్ తొలగించాల్సి వచ్చిందంటూ మనోజ్ ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దీంతో తన స్నేహితుడి కారణంగా ట్వీట్ డిలీట్ చేయాల్సివచ్చిందని మనోజ్ మరో ట్వీట్ చేశాడు. కొద్దిసేపటికి ఆ ట్వీట్ కూడా తొలగించాడు. దీంతో నెటిజన్లు అసలు ఎందుకు ఇలా ట్వీట్లు డిలీట్ చేస్తున్నారంటూ మనోజ్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Well for everyone who thought I deleted the tweet, ‘Na istam’ ..... for everyone who thought I got influenced to delete the tweet, ‘Na dash’ ( yevadiki antha bomma ledhu ) .... for everyone who thought I was true, ‘yedhavalani lite theesukondi’ papam vallu mana bharathiyuleee :) https://t.co/EK0kHUdM6t
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 31, 2019
దీంతో మనోజ్ చేసిన వొక ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ మనోజ్ ఏమని ట్వీట్ చేశాడంటే.. నేను పెట్టిన ట్వీట్ డిలీట్ చేశాననుకునే ప్రతీ వొక్కరికీ.. నా ఇష్టం . నేను ఎవరి కారణంగానో ప్రభావితమై ట్వీట్ డిలీట్ చేశానని భావించే వారందరికీ.. నా డ్యాష్(ఎవరికీ అంత బొమ్మ లేదు).. నేను నిజాయితీగా ఉన్నానని భావించే ప్రతి వొక్కరికీ.. వెధవలని లైట్ తీసుకోండి (పాపం వాళ్లూ మన భారతీయులే అంటూ రాసుకొచ్చాడు. వో సెలబ్రిటీగా మంచు మనోజ్ అసభ్యకర పదజాలం వాడడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.