పార్లమెంటు ఆవరణలో ఏపీ నేతల ఆందోళన

SMTV Desk 2019-01-31 13:36:36  tdp, ycp, parliament

న్యూఢిల్లీ, జనవరి 321: ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ, వైసీపీ నేతలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. అయితే బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో నేతలు ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. అలాగే టీడీపీ నేతలు సుజనా చౌదరి, కనకమేడల, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఏపీకి న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు.