ముంబై, ఆగష్టు 1: టెలికాం రంగంలో నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించాలనే నేపధ్యంలో ప్రవేశపెట్టిన మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సౌలభ్యం మాదిరిగా బ్యాంకు ఖాతా పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోనికి రాబోతున్నట్లు సమాచారం. ఈ దిశగా అడుగులు వేయాలని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తే వినియోగదారులకు మేలైన సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ప్రతి సంవత్సరం వినియోగదారుల మెరుగైన సేవలు అందించాలనే దృక్పథంతో నిర్వహించే బ్యాంక్ అంబుడ్స్మన్ సదస్సులో ఈ అంశం గురించి లేవనెత్తారు.