హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలో జరుగుతన్న పంచాయతీ ఎన్నికల పోరు ఈ రోజుతో ముగిసింది. చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో ముగిసాయి. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అధికారులు మొత్తం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఉప సర్పంచి ఎన్నికను నిర్వహిస్తారు.