హైదరాబాద్, జనవరి ౩౦: ఈ రోజు ఉదయం హైదరాబాద్ సిటీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబా నగర్ లో యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. GHMCలో కారు డ్రైవర్ గా పనిచేసే రాకేశ్ (23), ల్యాబ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఫ్రెండ్ బర్త్డే పార్టీ బెల్లి వచ్చి అలాగే తమ్ముడిని సాయి బాబా నగర్ లో డ్రాప్ చేయడానికి బైక్ పై బయలుదేరాడు. దీన్ని గమనించిన దుండగులు అతడిని వెంబడించి సాయి బాబా నగర్ దగ్గరకు వచ్చిన వెంటనే అడ్డుకొని దాడి చేసారు. రాకేష్ ను హాకి స్టిక్స్ తో కొట్టి, కత్తితో పొడిచి, తలపై రాళ్ళతో కొట్టి చంపారు. దాంతో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కోసం స్పెషల్ టీం ని ఏర్పాటు చేసారు. ఫలక్ నుమ ఏసీపీ మహమద్ అబ్దుల్ రషీద్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ హత్య వెనుక లంబడి రాజు అనే వ్యక్తి హస్తం ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.