హైదరాబాద్, ఆగష్టు 1: బాహుబలి తరువాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యు. వి. క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ‘ట్రాన్స్ఫార్మర్స్’, ‘డై హార్డ్’, ‘పెరల్ హార్బర్’, ‘జి-ఫోర్స్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన స్టంట్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఇప్పటివరకు ‘సాహో’ టీజర్ చూసి, దాన్ని చాలా మంది సైన్స్ ఫిక్షన్ సినిమాగా భావించారు. కానీ ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో తీస్తున్న యాక్షన్ ఫిల్మ్’’ అని తెలిపారు ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి తగ్గట్లు యూనివర్సల్ అప్పీల్ ఉండే కథ కావాలనుకున్నారట. ‘‘సుజిత్ చాలా మంచి స్క్రిప్టు రాశారు, అది స్క్రిప్టులో కనిపించింది, అందరూ మాట్లాడుకునే విధంగా యాక్షన్ సీన్స్ చేయాలనుకుంటున్నాం. అందుకే కెన్నీ బేట్స్ను తీసుకున్నాం’’ అని చెప్పారు ప్రభాస్. ఈ సినిమాని హైదరాబాద్తో పాటు ముంబై, దుబాయ్, అబుదాబి, యూరప్లో కూడా తెరకెక్కించనున్నట్లు అని సమాచారం.