కోల్కతా, జనవరి ౩౦: పశ్చిమ బెంగాల్ ఈస్ట్ మిడ్నాపూర్ లో మంగళవారం జరిగిన బహిరంగ సభ కి బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరైన పలు వాహనాలను గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు అంటించి విధ్వంసం సృష్టించారు. బీజేపీ నేత రాహుల్ సిన్హా మీడియా తో మాట్లాడుతూ ఈ దాడి వెనుక అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉండే ఉంటుందని పేర్కొన్నారు. బీజేపి కి బలం పెరుగుతుండటంతో తృణమూల్ నేతలు ఈర్ష్య తో చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు తగిన మూల్యం మమతా బెనర్జీ చెల్లించుకునే సమయం మరెంతో దూరంలో లేదని హెచ్చరించారు. ఈ వివాదానికి ముందే అమిత్ షా సభ లో మాట్లాడుతూ, పౌరసత్వ బిల్లుపై మమతా బెనర్జీ అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.