బాబుకు షాక్ ఇచ్చిన విపక్షాలు..

SMTV Desk 2019-01-30 12:01:16   chandrababu, tdp, pavan kalyan, janasena, bjp, congress, ap, ap state divided, ycp

అమరావతి, జనవరి 30: ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి విపక్షాలన్నీ దూరం కానున్నాయి. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధులను పంపుతుందని భావించినా, ఆ పార్టీ కూడా సమావేశానికి రావడం లేదని ఈరోజు ఉదయం స్పష్టం చేసింది. కాగా ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ ఈ సమావేశానికి తాము రాబోవడం లేదని ప్రకటించగా, ఈ తరహా సమావేశాలు వృథా అని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే ఇక వామపక్షాలతో పాటు, బీజేపీ కూడా సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, ఎన్నికలకు ముందు కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో అఖిలపక్ష సమావేశాలంటూ హడావిడి చేయడం ఏంటని కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ ప్రశ్నించారు.