ఏపీకి రూ. 900 కోట్ల బడ్జెట్..

SMTV Desk 2019-01-29 13:41:44  Central Govt, BJP govt, ap budget,

హైదరాబాద్, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి కేటాయించున్న బడ్జెట్ విషయంపై ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కి రూ.900 కోట్ల కరువు సహాయ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఏపీతో సహా మొత్తం నాలుగు రాష్ట్రాలకు కరువు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మహారాష్ట్రకు రూ. 4700 కోట్లు, కర్ణాటకకు రూ. 950 కోట్లను తక్షణమే విడుదల చేయబోతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తెలిపారు. ఏపీకి రూ. 900 కోట్లు, గుజరాత్ కు రూ. 130 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.