హైదరాబాద్, జనవరి 28: పర్యాటక శాఖ పరిధిలోని సందర్శక ప్రదేశాలు, హోటళ్ళలో వయోదికులకు 25 శాతం రాయితీలు ఇస్తామని, మంగళవారం నుంచే ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. తెలంగాణా ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టస్క) ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో వయోదికుల సంఘం డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత సంగీతం, నృత్యం, ఇతర కళల్లో ఆసక్తి ఉండి, నేర్చుకోవాలనుకునే వారికీ సంగీత, నృత్య కళాశాలల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.