అఖిలపక్ష సమావేశానికి వైసీపీ దూరం!

SMTV Desk 2019-01-29 11:34:43  undavalli arun kumar, chandrababu, ysr congress party, tdp, janasena, bjp, congress, ap, ap state divided

విజయవాడ, జనవరి 29: రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, విభజన హామీలపై సమీక్షించడానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో ఈరోజు విజయవాడలో ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హాజరవుతుండగా వైసీపీ మాత్రం దూరంగా ఉంది. ఈ అఖిలపక్షానికి హాజరు కావాలని నిర్ణయించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ తరపున మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపుతున్నారు. టీడీపీతో కలిసి వొకే వేదికను పంచుకోలేమని పేర్కొన్న వైసీపీ ఈ సమావేశానికి తాము హాజరు కాబోవడం లేదని తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు హాజరువుతున్నాయని ఉండవల్లి ప్రకటించారు. మరోవైపు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై కూడా చర్చించనున్నారు.