నేడు ఏపీలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ...

SMTV Desk 2019-01-29 10:18:18  Kiya motors, AP CM, Chandrababu, Koriya

అనంతపురం, జనవరి 29: అంతర్జాతీయ గుర్తింపు పొందిన కియా మోటార్స్ ఇప్పుడు ఏపీలో చక్కర్లు కొట్టనున్నాయి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కియా తొలికారును ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల పరిశ్రమ జిల్లాగా ఖ్యాతిగాంచనుంది.

వాస్తవానికి దేశంలో తొలి ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కియా ప్రతినిధులు వివిధ రాష్ట్రాలను పరిశీలించారు. అయితే ఏపీ ప్రభుత్వం, సిఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి ఖకియా మోటార్స్‌గను అనంతపురానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.