న్యూఢిల్లీ, జనవరి 26: కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని యూపీ తూర్పు ప్రాంత ఇంచార్జ్ గా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించడంపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. రాజకీయాల్లో యువతకు అవకాశం ఇవ్వడాన్ని ఎస్పీ స్వాగతిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం శుభపరిణామన్నారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి కలిసిరావాలని కోరుకుంటున్నా, ప్రియాంకను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించిన రాహుల్ గాంధీకి అభినందనలు అని అఖిలేష్ అన్నారు.