చంద్రబాబు అప్పుడు గాడ్సే.. ఇప్పుడు గాంధీనా?

SMTV Desk 2019-01-26 16:23:18  ramachandraiah, ysrcp, vangaveeti radha, chandrababu naidu, tdp

తిరుపతి, జనవరి 26: వంగవీటి రాధా టీడీపీ లో జాయిన్ అవ్వటం పై వైసీపీ నేత సీ. రామచంద్రయ్య స్పంచించారు. వంగవీటి రాధాకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు గాంధీగా కన్పించేందుకు కారణాలు చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. వంగవీటి రాధా వొకప్పుడు చంద్రబాబును గాడ్సేగా అభివర్ణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈరోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు.





ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వంగవీటి రాధా తన తండ్రిని హత్య చేయించింది తెలుగుదేశం పార్టీయేనని ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. రాధాకు అప్పుడు గాడ్సేలా కనిపించిన చంద్రబాబు ఇప్పుడు గాంధీలా ఎలా కన్పిస్తున్నారో చెప్పాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయన వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడ వొంటరిగానే పోటీ చేస్తోందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెడుతున్నారని, బాబు లాంటి రాక్షసుడి పాలన నుండి ప్రజలను కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వొక్కడేనని రామచంద్రయ్య విమర్శించారు.