ఏపీ కోసం రూ.5 లక్షల కోట్లు తెస్తా ???

SMTV Desk 2019-01-26 12:45:16  KA Paul, prajasanthi party, narendra modi, chandra babu, pavan kalyan, BJP, TDP, Janasena party

విశాఖపట్టణం,జనవరి 26: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్... భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి, బడ్జెట్‌కు పొంతనే లేదని కేఏ పాల్ విమర్శించారు. నిన్న విశాఖలోని తన నివాసంలో పాల్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి బడ్జెట్ కి సరిపడా ఆదాయం లేదు మిగతా బడ్జెట్ ఎక్కడ నుంచి తెస్తారు అని ప్రశ్నించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాతూ... ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆదాయం రూ.1.5 లక్షల కోట్లని, బడ్జెట్ మాత్రం రూ.3.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. మిగతా రెండు లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. అవినీతి రహిత సమాజ స్థాపనే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమన్నారు. ఏపీ కోసం రూ.5 లక్షల కోట్ల నిధులు తెచ్చే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. తమతో కలిసి రావాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను పాల్ ఆహ్వానించారు. తమతో పొత్తు పెట్టుకోకుంటే జనసేన పార్టీకి వొక్క సీటు కూడా రాదని పాల్ జోస్యం చెప్పారు.