చర్చకు నో చెప్పిన టీడీపీ, వైసీపీ...

SMTV Desk 2019-01-25 17:14:51  undavalli arun kumar, ysr congress party, tdp, ap, ap state divided

కాకినాడ, జనవరి 25: ఏపీకి రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయంపై ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. వైసీపీ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పిందని ఆయన అన్నారు. ఇక టీడీపీ నుంచి తమ ఆహ్వానం పట్ల ఎలాంటి స్పందన లేదని ఈరోజు ఆయన మీడియాతో చెప్పారు.





ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టంపై సమీక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలతో జనవరి 29వ తేదీన సమావేశం ఏర్పాటు చేసాం. అయితే ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించగా, టీడీపీ ఇంకా స్పందించలేదన్నారు. కాగా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. జనసేన, వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలావుంటే, విభజన హామీలపై ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ జరగనుంది. ఈ బంద్ కు ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన మద్దతు ప్రకటించింది.