జనవరి 24: టెలికాం లో కొత్త వొరవడి సృష్టించిన రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగాదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను ఈరోజు ప్రవేశపెట్టింది. రూ.594, రూ.279 ప్లాన్లను జియో ఫోన్ యూజర్లు ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ వినియోగదారులకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 500 ఎంబీ డేటా, నెలకు 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే జియో యాప్స్కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఇక రూ.594 ప్యాక్ వాలిడిటీ 168 రోజులుగా ఉండగా, రూ.297 ప్యాక్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.