మహేశ్, సుకుమార్ చిత్ర కధ ఇదే..

SMTV Desk 2019-01-23 17:49:18  Mahesh babu, Maharshi, Sukumar, movie news, movie story

హైదరాబాద్, జనవరి 23: ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రం తరువాత మహేశ్ .. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

అయితే ఈ సినిమా పూర్తిగా అడవి నేపథ్యంలో కొనసాగుతుందని సమాచారం. సుకుమార్.. చరణ్ తో చేసిన రంగస్థలం చిత్రం గోదావరి నేపథ్యంలో ఎలా సాగుతుందో, అదే విదంగా ఈ సినిమా మొత్తం అడవి నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. ఈ కథ మహేశ్ కి బాగా నచ్చటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ మే నెలలో గానీ .. జూన్ లో గాని మొదలుకావొచ్చని అంటున్నారు.