న్యూజిలాండ్ గడ్డపై భారత్ భోణీ

SMTV Desk 2019-01-23 14:19:47  India VS Newzeland, ODI, VIart kohli, Shikar dhawan, Kane willamson

నేపియర్, జనవరి 23: భారత్-న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ పూర్తి అయ్యేసమయానికి న్యూజిలాండ్ జట్టు 157 పరుగులకు ఆలౌట్ అయి కోహ్లీ సేనాకు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రమె (64) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం 34.5/49 వద్ద భారత్ 2 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసి న్యూజిలాండ్ లో భోనీ కొట్టింది. అనంతరం భారత్ ఇన్నింగ్స్ లో 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో కోహ్లీకి (45) త్రుటిలో అర్థ సెంచరీని కోల్పోయాడు. శిఖర్ ధావన్ 75 నాట్ అవుట్ గ నిలిచాడు. 8 వికెట్ల తేడాతో 34.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేదించింది.