నేడు ఏపీ సీఎంతో పవన్ భేటీ

SMTV Desk 2017-07-31 11:42:31  Pawan kalyan, janasena, AP CM, chandrababu naidu, uddanam

అమరావతి, జూలై 30: ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పవన్ నేడు ఏపీ సిఎంతో భేటీ కానున్నారు. ఆయన హార్వర్డ్ బృందంతో కలిసి ఉద్దానం సమస్యపై చంద్రబాబుతో చర్చించనున్నారు. ఉద్దానంలో అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇప్పటికే హార్వర్డ్ డాక్టర్స్ చేసిన అధ్యాయనంపై సీఎంతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో హార్వర్డ్ బృందం ఇచ్చిన నివేదికను సిఎంకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకే హార్వర్డ్ డాక్టర్స్ బృందం ఉద్దానంలో పర్యటించి కిడ్నీ సమస్యపై పూర్తి వివరాలు సేకరించారు. అయితే ఈ బృందంతో పవన్ ఆదివారం విశాఖలో సమావేశమైన విషయం తెలిసిందే. నేడు విశాఖ నుండి ఏపీ సెక్రటేరియట్‌కు చేరుతారు. కాగా మొదటిసారి పవన్ ఏపీ సచివాలయానికి వెళ్తున్నారు.