'ఆర్ ఆర్ ఆర్' కోసం రాజమౌళి కొత్త టెక్నాలజీ..

SMTV Desk 2019-01-21 17:56:10  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, new cemera lens

హైదరాబాద్, జనవరి 21: రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం సందర్భంగా బ్రేక్ తీసుకొని ఈ రోజున రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టింది. తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ .. చరణ్ పై భారీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ చేస్తున్నారు.

కాగా, ఈ చిత్రం కోసం భారత దేశంలోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ ఎఫ్ .. అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ను ఉపయోగిస్తున్నాము అని సెంథిల్ కుమార్ ట్వీట్ చేశాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికలుగా కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. వొక ముఖ్యమైన పాత్రలో ప్రియమణి కనిపించనుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి వున్నారు.