హైదరాబాద్, జనవరి 21: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ఓ ఇంగ్లీష్ మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సిఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికలో విజయ సాధించాలని, ప్రధాని కావాలనే కోరికతోనే ఈరోజు నుండి ఐదు రోజుల పాటు సహస్ర చండీ మహాయాగం చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్త ప్రచురించింది.
ఈ వార్తకు స్పందించిన కేటీఆర్ కొన్ని మీడియా సంస్ధలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని, ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని సంబంధిత ఇంగ్లీష్ మీడియాకు ఘాటుగా సమాధానం ఇస్తు కెటిఆర్ ట్వీట్ చేశారు.