చిత్తూర్, జనవరి 21: జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై ఆదివారం వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా కందూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కాస్త బెడిసి కొట్టింది.
ఈ సభకు హాజరైన హైపర్ ఆది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకొచ్చారు.
జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు.