గుజరాత్, జనవరి 20: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పర్యటనలో భాగంగా ఆయన గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని దర్శించుకున్నారు. దేశానికి పటేల్ చేసిన సేవల్ని కొనియాడారు. స్వతంత్ర భారతదేశపు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గత సంవత్సరం అక్టోబర్ 31న ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో నర్మద నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎత్తైనది. 182 అడుగుల పటేల్ భారీ విగ్రహం కోసం వొక లక్షా నలభై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, రెండు వేల టన్నుల కాంస్యం, డెబ్బైవేల టన్నుల సిమెంటును వినియోగించారు.