ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా...!!!

SMTV Desk 2019-01-20 18:16:42  Facebook, Social media, FTC, Penalty

వాషింగ్టన్, జనవరి 20: సామజిక మాధ్యమాల్లో అగ్ర స్థానంలో ఉన్న పేస్ బుక్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే యూజర్ల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందనే విషయంపై ఫేస్‌బుక్‌ విచారణ ఎదుర్కొంటూ అందరిచే విమర్శలు పాలవుతుంది. వినియోగదారుల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన వివరాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించినందుకు ఫేస్‌బుక్‌ కష్టాలను కొని తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆ సంస్థకు వొక ఝలక్‌ తగలన్నుట్లు తెలుస్తోంది. ఈ డాటా లీకేజీ అంశంపై అమెరికాకు చెందిన వినియోగదారుల వ్యవహారాల సంస్థ ఫెడరల్‌ ట్రేడ్‌ కమీషన్‌ (ఎఫ్‌టిసి)ముమ్మర విచారణ చేపట్టింది. ఫేస్‌బుక్‌ సంస్థ కూడా డాటా లీకేజీకి పాల్పడినట్లు వొప్పుకోవడంతో ఆసంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ఎఫ్‌టిసి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో 2012లో ఇలాగే వినియోగదారులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసిన గూగుల్‌ సంస్థకు ఎఫ్‌టిసి రికార్డు స్థాయిలో 16వేల కోట్ల రూపాయల ఫెనాల్టీ విధించింది.

తాజాగా ఫేస్‌ బుక్‌ కూడా అలాంటి గోప్యతా ఉల్లంఘనలకే పాల్పడినందుకు ఇదే తరహాలో జరిమానా విధించేందుకు ఈ వినియోగదారుల సంస్థ యోచిస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలువరిస్తున్న కథనాల తెలుపుతు న్నాయి. అంతకుమించి జరిమానా విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని తాజాగా వెలువడిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూజర్ల సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అంశంపై ఎఫ్‌టిసి చేపట్టిన దర్యాప్తు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను కలిగి ఉన్న సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌పై డాటా లీకేజీకి సంబందించి తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌ ఇతర సంస్థలతో పంచుకున్నట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ విషయంలో నిజంగానే తప్పు జరిగినట్లు వొప్పుకున్న ఫేస్‌బుక్‌ విచారణ సందర్భంగా అమెరికా పార్లమెంటరీ కమిటీముందు కూడా వొప్పుకుంది. ఫేస్‌బుక్‌ సిఈఓ జుకన్‌బర్గ్‌ కూడా ఈ తప్పిదంపై బహి రంగ క్షమాపణలు కూడా చెప్పారు. అమెరికన్‌ పార్లమెంటరీ కమిటీ ముందు జుకన్‌బర్గ్‌ హాజరై డేటా లీక్‌ విషయంపై వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు. ఇలా స్వతహాగా ఫేస్‌బుక్‌ సంస్థే డేటా లీకేజీపై వొప్పుకుంది. కాబట్టి ఎఫ్‌టిసి చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో భారీ జరిమానా విధించేందుకు సిద్ధపడినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ వెల్లడించింది.