హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషితో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ ఎన్నికల ఏర్పాటుకై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 22న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఓటరు జాబితా నమోదు ప్రక్రియ జరుగుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాపై ఈనెల 25 వరకు గడువు ఇచ్చింది. మేము ఫిబ్రవరి 4 వరకు గడువు కోరనా ఫలితం లేకుండా పోయింది. పోలింగ్ కేంద్రాల దగ్గర బీఎల్వోలు అందుబాటులో ఉంటారని పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లి ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి అని అన్నారు. ఎన్నికల్లో ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం. కాగా గ్రాడుయేట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు.