హైదరాబాద్, జనవరి 19: చమురు ధరలు తగ్గుముఖం పట్టిన భారతదేశంలో పెట్రోల్ ధరలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ అంబరాన్ని అంటుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిలు ధరలు మూడు రోజు (శనివారం) కూడా పెరిగాయి. ఈరోజు లీటరు పెట్రోల్పై19 పైసలు, లీటర్ డీజిల్ పై 29పైసలు చొప్పున ధర పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు 2శాతం తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరుగుతూండటం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.69.26కు చేరగా, డీజిల్ ధర రూ. 63.10వద్ద ఉంది.
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.73.41... డీజిల్ ధర రూ.68.57గా ఉంది.
విజయవాడ : లీటరు పెట్రోలు ధర రూ.72.95 , ఉండగా డీజిల్ ధర రూ.67.76గా ఉంది.
చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ.71.87 , డీజిల్ ధర రూ.66.62గా ఉంది.
ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.75 .... డీజిల్ ధర రూ.66గా ఉంది.
కోల్కతా : పెట్రోల్ ధర లీటరు ధర రూ.71.39, ఉండగా డీజిల్ రూ .64.87 ఉంది.