గుంటూర్, జనవరి 18: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, తెదేపా అధినేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూర్ జిల్లాలోని సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. తరువాత ఆయన మాట్లాడుతు ఎన్టీఆర్ వొక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు.
ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నామని అన్నారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సాగర్లో సభాపతి కోడెల శివప్రసాద్రావుతో కలిసి బోటులో విహరించారు.
ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నాము. అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధిలో అందరికన్నా మిన్నగా ఫలితాలు సాధిస్తున్నాము. pic.twitter.com/9zAD3bAvox
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2019