గుంటూర్, జనవరి 18: ఈ రోజు ఉదయం గుంటూర్ జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వొక్క గిఫ్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిఫ్ట్లు ఇస్తారని అన్నారు. నాకేదో గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని ఈ బెదిరింపులకు తాను భయపడనని బాబు మరోసారి స్పష్టం చేశారు.
కేసీఆర్కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడని బాబు ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్లు కలిసినా ఏపీని ఏమీ చేయలేరని బాబు ధీమాను వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీతో దాడులు చేయిస్తారా అని బాబు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదని బాబు హెచ్చరించారు.